బోధన్, మన సమాచార్ (04 ఫిబ్రవరి):
వంద శాతం పన్నుల వసూలును త్వరగా పూర్తిచేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అన్నారు. బోధన్ పట్టణంలో కొనసాగుతున్న నీటి, ఇంటి పన్నుల వసూలు కార్యక్రమాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో పన్నుల వసూలులో పర్యటిస్తున్న సిబ్బందితో మాట్లాడి రోజువారి వసూలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పన్నుల వసూలు కోసం వస్తున్న సిబ్బందికి ప్రజలు సహకరించి తమ తమ బకాయిలను సకాలంలో చెల్లించాలని ప్రజలను కోరారు. పట్టణ అభివృద్ధి కోసం పన్నుల వసూలు చాలా అవసరం అని, సిబ్బంది ఎప్పటికప్పుడు నీటి, ఇంటి పన్నుల వసూలును సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు.