గిట్టు బాటు కావడం లేదు... క్వారీ వద్ద టిప్పర్ యజమానుల ఆందోళన...!

 


బోధన్، మన సమాచార్, 25 ఫిబ్రవరి:

ఇసుక రవాణా గిట్టు బాటు కావడం లేదని, టిప్పర్ లో ఇసుక నింపే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం మందర్న ఇసుక క్వారీ వద్ద టిప్పర్ యజమానులు ఆందోళన నిర్వహించారు. అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్నారనే ఆరోపణలు రావడం తో రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏడు క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే టిప్పర్ల లో నింపి రవాణా చేయాలని ఆదేశించారు. గతం లో 10 నుంచి 12 క్యూబిక్ మీటర్ల ఇసుక నింపి రవాణా చేసే వారు. ఇసుక నింపడానికి క్వారీ వద్ద 8,500 రూపాయలు చెల్లించేవారు. ప్రస్తుతం 7 క్యూబిక్ మీటర్ ల ఇసుక నింపడానికి కూడా అంతే మొత్తం తీసుకోవడం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ నింపడానికి వసూలు చేస్తున్న మొత్తం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం క్వారీ వద్ద టిప్పర్ యజమానులు సమావేశం నిర్వహించారు. రెవెన్యూ వారు గతంలో ఇరవై టన్నులకు 4800 డిడి తీసుకొనేవారు. ప్రస్తుతం రవాణా శాఖ అధికారుల సూచన మేరకు టిప్పర్ ల సామర్థ్యాన్ని బట్టి రేటు నిర్ణయించారు. ఏడు క్యూబిక్ మీటర్లకు 2500 రూపాయలు డిడి చెల్లించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం తగ్గిన సుమారు 5 క్యూబిక్ మీటర్ల ఇసుక నింపక పోయినప్పటికీ సొమ్ము చెల్లించాల్సి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ లను నిలిపి వేశారు. టిప్పర్ నింపే ధర తగ్గించాలని పట్టుబట్టారు. ఇసుక నింపే ధర విషయంలో తమకు సంబంధం లేదని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. క్వారీ నిర్వాహకులకు సంబంధించిన అంశమని అన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది