బోధన్, మన సమాచార్, ఫిబ్రవరి 25 :
చికెన్ పై వస్తున్న అపోహలను తొలగించడానికి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏ 1 పౌల్ట్రీ ట్రెడర్స్, వెంకబ్ చికెన్ కంపని నిర్వాహకులు సంయుక్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని గోశాల రోడ్డులోని ఏ 1 చికెన్ కార్యాలయం వద్ద మంగళవారం చికెన్, గుడ్లు ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చికెన్ తో పలు రకాల వంటలు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ 1 ట్రేడర్స్ నిర్వాహకులు మీర్ ఇలియాస్ అలీ, మీర్ హాసన్ అలీ, వెంకబ్ కంపనీ నిర్వాహకులు మాట్లాడుతూ చికెన్, కోడిగుడ్లు తినడం వల్ల ఎటువంటి వ్యాధులకు గురి అయ్యే అవకాశం లేదని, నిరభ్యంతరంగా వీటిని తినవచ్చని సూచించారు. కొందరు చేసిన ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర అగాధంలోకి నెట్టివేయబడిందని ప్రముఖ పౌల్ట్రీ ఎగ్ వ్యాపారి ఇలియాస్ ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ తినడం వల్ల ఎటువంటి వ్యాధులు సంక్రమించవని తెలిపారు. కోళ్ల పరిశ్రమపై దుమారం సృష్టించి చికెన్ తినడాన్ని నిలిపి వేసే విధంగా ప్రచారం నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు సైతం రాష్ట్రంలో చికెన్ నిరభ్యంతరంగా తిన వచ్చు అని సూచనలు చేశారని అన్నారు. ప్రజలలో అపోహలను తొలగించడానికి వీలుగా చికెన్ వ్యాపారులు వండి ప్రధాన ప్రాంతాలలో ప్రజలకు అందజేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకబ్ ప్రతినిధులు నవీన్, మల్లేష్, వరప్రసాద్, రాజు పాల్గొన్నారు.