సిఎంను కలిసిన ట్రస్మా ప్రతినిధులు...!

 


బోధన్, మన సమాచార్, ఫిబ్రవరి 26 :

నిజామాబాద్ జిల్లా ట్రాస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ ప్రతినిధులతో పాటు  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం కలిశారు. ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కు వివరించారు. ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి సిఎం సానుకూలంగా స్పందించారని కొడాలి కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను విన్నవించేలా సహకరించిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ట్రస్మా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది