బోధన్, మార్చ్ 01, మనసమాచార్:
వైద్యసేవలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించ వద్దని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శనివారం జిల్లా లోని సాలుర ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించారు. ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. పెచ్చులు ఊడుతున్న గదులను పరిశీలించారు. మరమత్తులు చేసేంతవరకు ఈ గదులను వినియోగించ వద్దని సూచించారు. ఆయన వెంట తహాసీల్దార్, ఆస్పత్రి ఉద్యోగులు ఉన్నారు.