మన సమాచార్- బోధన్
పదో తరగతి పరీక్షా ఫలితాలలో బోధన్ పట్టణంలోని ఇందూర్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. విద్యార్థిని సంజన 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో పాఠశాల కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. ఎం ఐశ్వర్య 582 జి సంజన 572, కీర్తన 567 మార్కులు సాధించారు. పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించారు. 120 మంది విద్యార్థులు 500 పైగా మార్పులు సాధించి నట్లు కరస్పాండెంట్ కిషోర్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా 51 మంది విద్యార్థులు 10 గ్రేడ్ సాధించారని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని సంజన రాష్ర్ట స్థాయి మార్కులు సాధించడం తమ పాఠశాలకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఉపాధ్యాయుల ప్రత్యేక బోధన వలనే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని కొడాలి కిషోర్ తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.