మన సమాచార్ - బోధన్
అసాంఘిక కార్యక్రమాల నుండి యువతను కాపాడటంలో భాగంగా జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. జిల్లా కమిషనర్ ఆదేశానుసారం యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ నిర్మునలలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పోలీసు జాగిలాలతో మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని షక్కర్ నగర్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాలలో ని హోటల్లు, పాన్ షాపులలో, ఆటో స్టాండ్ ల వద్ద జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు.