మన సమాచార్ - బోధన్
ఇంటర్ మీడియట్ పరీక్ష ఫలితాలలో నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శ్రీ విజయసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ లో ఎం. హోమ 982మార్కులు సాధించారు. ఐ. మహేందర్ 972 మార్కులు, ప్రణీత్ గౌడ్ 946 మార్కులు సాధించి మొదటి ర్యాంక్ లో నిలిచారు.
మొదటి సంవత్సరం పరీక్షలలో డి. నితిన్ 468 మార్కులు, బైపీసీలో కె. అభిరామ్ 423 మార్కులు, సి ఈ సి విభాగంలో షాహిస్త బేగం 448 మార్కులు సాధించి కళాశాల కీర్తి ప్రతిష్టలు పెంచారు. ఉత్తమ విద్యా బోధన ల వలన తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో మార్కులు సాధిస్తున్నారని ప్రిన్స్ పాల్ సుబ్బారావ్ తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.