మన సమాచార్ - బోధన్
బోధన్ పట్టణం స్థానిక రైస్ మిల్ అసోసియేషన్ లో ఎస్సి ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఆదివారం మహనీయుల జయంతి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్సి ఎస్టీ హక్కులు పరిరక్షణ కమిటీ కన్వీనర్ నీరడి ఈశ్వర్ మాట్లాడుతూ ఏప్రిల్ 30న బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగే మహనీయులు డా బి ఆర్ అంబేద్కర్, జ్యోతి భాపులే, బాబు జగజీవన్ రామ్ జయంతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి డివిజన్ లో ఉన్న అన్ని గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో రావాలని కోరారు. మహనీయుల జయంతి కి ముఖ్య అతిథులుగా దళిత సేన అధ్యక్షుడు డా. జె బి రాజు, దళిత జే ఏ సి చైర్మన్ ప్రోపెసర్ గాలి వినోద్ కుమార్, ప్రొపెసర్ ప్రసన్న హరికృష్ణ, గజ్జల అశోక్ కళాబృందం, నాగపూర్ నుండి అంజలీ భారతి, గౌతంభలే రావుల ఆమ్న సామ్నా కార్యక్రమలతో పాటు సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ ఉంటుదని అయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సి, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కో కన్వీనర్లు నీరడి రవి, సింగడే పాండు, దేవేందర్, సలహాదారులు కొండ్రా వెంకటి, వాగమరే సూర్యకాంత్, కోశాధికారి మధాస్తు శ్రవణ్ కుమార్, వివిధ మండల అధ్యక్షులు దాసరి శ్యామ్, కారం స్వామి, రాహుల్, భీమ్ రావు, ఇందూర్ సాయిలు, గౌతంకుమార్, చరణ్, సాగర్, సురేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.