మన సమాచార్ - బోధన్
అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్ లను బోధన్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. సాలుర మండలంలోని మందర్న శివారులో గల మంజీర నది నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాకు అనుమతులు లేకపోవడంతో పట్టుకున్నట్లు రూరల్ ఎస్ఐ మశ్చేందర్ తెలిపారు.