మన సమాచార్ - బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి మంగళ వారం పంట పొలాలను పరిశీలించారు. నియోజక వర్గంలో నీ వరి పంట పై వ్యాపించిన తెగుళ్ళు రైతులను కలవర పరుస్తున్నాయి. రైతులకు తగిన సూచనలు కోసం ఎంఎల్ ఏ సుదర్శన రెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్తలు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం చెరకు వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో గ్రామాలలో పర్యటించారు. పంట పొలాలను పరిశీలించారు. బోధన్ సాలూర మండల గ్రామాలలో పర్యటించి వరి వ్యాపించిన తెగుళ్లపై రైతులకు సూచనలు అందచేయించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు గంగా శంకర్, అల్లే జనార్ధన్, ఇల్తేపు శంకర్, ఆల్లె రమేష్, అధికారులు ఉన్నారు.