తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య...!

 


మన సమాచార్ - హైదారాబాద్

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  శనివారం తెల్లవారుజామున ఏఆర్ కానిస్టేబుల్  దూసరి  బాలకృష్ణ గౌడ్ (28) తన పిస్టల్ తో కాల్చుకొని  ఆత్మహత్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం తెల్లవారుజామున బాత్రూం గదిలోకి వెళ్లి తలుపులు మూసివేసి, తన సొంత ఆయుధంతో  కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని ఆదిభట్ల పోలీసులు నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలింలించారు. మృతి చెందినప్పుడు మృతుడితోపాటు సహ ఉద్యోగులు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. మృతుడు స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని  మంచాల మండల కేంద్రం. సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న బాలకృష్ణ. మృతుడు బాలకృష్ణ   ఆన్లైన్ గేమ్స్ బానిసై ఆత్మహత్య  చేసుకున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది