కామారెడ్డి, డిసెంబర్ 15 (మన సమాచార్): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం తిమ్మాపూర్ లో గల తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానములో ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించు కున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, పోచారం శంభు రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోషియేషన్ సభ్యుల సహాకరంతో తెలంగాణ తిరుమల దేవస్థానములో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమానికి సహకరించిన రైస్ మిల్ అసోషియేషన్ సభ్యులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నసురుల్లాబాద్ మండలం నాచుపల్లికి చెందిన నళిని - దయానంద్ దంపతులు జరిపించిన శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు. పెద్ద ఎత్తున నిత్య అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ తితిదే లో అన్నదానం ప్రారంభించిన పోచారం శ్రీనివాసరెడ్డి - రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం...!
byMana Samachar
-
0